Brief notes on Vemulawada Chalukyas

                                          వేములవాడ(లేములవాడ ) చాళుక్యులు

(క్రీ. శ. 750 – క్రీ . శ . 973)

1)వేములవాడ  చాళుక్యుల  తొలి కుటుంబ సభ్యులు  బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దగ్గర పనిచేశారని ప్రముఖ చరిత్ర కారులైన బి. ఎన్. శాస్త్రి గారు అభిప్రాయ పడ్డారు. . వారి పరాక్రమనికి మెచ్చుకొని బాదామి చాళుక్య రాజులు,     సత్యాశ్రయ రణ విక్రమునకు సపద లక్ష ప్రాంతాన్ని (నేటి తెలంగాణ లో ని కరీం నగర్ , నిజామాబాద్ జిల్లాలు ) , బోధన్ రాజధాని గా చేసుకొని పాలించటానికి ఇచ్చారుట. సత్యాశ్రయ రణ విక్రముని వారసులైన పృత్వీ పతి , రాజాధిత్య పృత విక్రముడు చాళుక్య రాజుల యుధ్ధాలలో సహాయం చేశారు .  

2) బాదామి చాళుక్యుల పతనం అనంతరం , వేములవాడ చాళుక్యులు , రాష్ట్రకూటుల కింద రాజులు గా , అర్ధ – స్వతంత్ర హోదాలో రెండు సంవత్సరముల పాటు పరిపాలన చేశారు.

3)ఈ కుటుంబ చరిత్ర మనకు  ( i ) కొల్లిపర, (  ii )కురవ గట్ట, ( iii ) పరభని ( iv  ) వేములవాడ శాసనాల ద్వారా తెలుస్తోంది. అంతే  కాకుండా పంప కవి రాసిన విక్రమార్జున విజయం లోనూ ఈ కుటుంబ వంశా వళి వివరాలు ఉన్నాయి.  

 

వినయాదిత్య యుద్ధ మల్ల I  (క్రీ. శ. 750  – క్రీ . శ . 775 )


(రాజధాని : బోధన్ ) ((కరీంనగర్ & నిజామాబాద్ జిల్లాలు ) (ఇక్కడ చోటుకు  సపద లక్ష పేరు  ఉంది )

  

అరికేసరి I (క్రీ. శ. 775   – క్రీ . శ . 800  )


 

                                                                                    ⇩

నరసింహ I


 

  


యుద్ధ మల్ల II


 

                                                                                 ⇩

(నోట్: ఈ మధ్యకాలపు వివరాలు తెలియటం లేదు )

 ⇩

బద్దెగ (క్రీ. శ. 850    – క్రీ . శ . 895   )

ఇతని బిరుదులు : “సొలద గండ “, 42 యుద్ధా లలో వీరుడు , ఓడింప బడని వీరుడు

ఇతను బద్దెగే శ్వరాలయము నిర్మించాడు. దీన్నే వేములవాడలోని  భీమేశ్వరాలయం అంటున్నారు .


   ⇩

యుద్ధ మల్ల III (క్రీ. శ. 895    – క్రీ . శ . 915   )


 

                                                                               ⇩

నరసింహ II ( క్రీ. శ. 915     – క్రీ . శ . 930    )

(కళా ప్రియ అనే ప్రదేశం లో విజయ స్థూపాన్ని స్థాపించాడు . )

(జకన్వి అనే  రాజకుమారిని వివాహమాడాడు)


 

  


ఆరి కేసరి  III (క్రీ. శ. 930     – క్రీ . శ . 941    )

ఇతని కాలం లో కన్నడ కవి పంప విక్రమార్జున విజయం అనే కన్నడ కావ్యం రాశాడు .

ఇతని కాలం లో వేములవాడలో ఆదిత్య గృహము నిర్మించ బడింది

ఇతను రేవకణి ర్మడి’,        లోకాంబిక అనే ఇద్దరు రాజ కన్యలను వివాహమాడాడు

ఇతనికి రేవకణి ర్మడి భార్య ద్వారా వగరాజు అనే కొడుకు  ; మరియు  లోకాంబిక భార్య ద్వారా భద్ర దేవ అనే కొడుకు జన్మించారు

అందువల్ల రాజ్యాన్ని రెండు భాగాలు చేశారు . 

 ⇩

 

 

 


వగరాజు                                                                                       భద్ర దేవ

ఇతని రాజధాని : గంగాధర                                       ఇతని రాజధాని : వేములవాడ

వగరాజు , యశస్తిలక చంపు అనే  గ్రంధం

రాసిన సోమ దేవ సూరి  ని

ప్రోత్సహించాడు .

సోమదేవ సూరి , వగ రాజుని

పాద పద్మోప జీవి అని  వర్ణించాడు

                                      భద్ర దేవు ని కుమారుడైన                                                              

                                                          అరికేసరి IV(క్రీ. శ. 946 – క్రీ . శ . 968  )

                                                       కాలం లో రాష్ట్ర కూటు రాజుల ప్రభావం అంతమైనది

 

తెలంగాణ ప్రాంతం లో రాష్ట్ర కూటుల ప్రభావం పోయి , కల్యాణి చాళుక్యుల ప్రభావం వచ్చినట్లు మెదక్ జిల్లాలో కొర ప్రోలు వద్ద లభ్యమైన తైల రాజు (క్రీ. శ . 973 ) శాసనం ద్వారా మనకు తెలుస్తోంది                                                    

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)