Model questions (Ikshwakulu Rule Period)

 

Model questions (Ikshwakulu   Rule Period)

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I /TSLPRB SUB-INSPECTOR /CONSTABLE

 Prepared by : Praturi Potayya Sarma

 

ఇక్ష్వాకులు   (క్రీ. శ.180   – క్రీ. శ. 248 )

1)ఎవరి పతనo అనంతరం , తెలంగాణ ప్రాంతం  ఇక్ష్వాకుల అధీనం లోకి వచ్చింది ?

ఎ)శాతవాహనులు

2)ఇక్ష్వాకులు ఎవరిని అనుసరించి మధ్య దక్కన్ లో చిన్న ప్రాంతాలలో పరిపాలన సాగించారు ?

ఎ )శాతవాహనులను

3)ఇదే సమయం లో పశ్చిమ దక్కన్ ప్రాంతం లో ఎవరు పరిపాలించేవారు ?

ఎ ) ఛుటు , శాతకర్ణీ లు , అభీరులు

4)ఎవరిని శ్రీ పర్వత ఆంధ్రులు అన్నారు ?

ఎ ) ఇక్ష్వాకులు

5) శ్రీ పర్వతం ప్రాచీన నామం ఏది ?

ఎ ) నల్ల మల్లురు

6) శ్రీ పర్వతాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు ?

ఎ ) నాగార్జున కొండ

7) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I పరిపాలన కాలం  ఏది ?

ఎ ) క్రీ. శ. 180  - క్రీ. శ. 193

8)  వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I రాజధాని ఏది ?

ఎ ) విజయపురి

9) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I కుమార్తె పేరు ఏది ?

ఎ ) అటవి శాంతి శ్రీ

10) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తన కుమార్తె అటవి  శాంతిశ్రీ ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?

ఎ ) ధనిక కుటుంబానికి చెందిన మహా సేనాపతి విశాఖ నాగ

11) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తన చెల్లెల్ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?

ఎ ) పూకియ వంశానికి చెందిన మహా సేనాపతి తళవారన కు ఇచ్చి పెండ్లి చేశాడు

12 ) వశీ ష్ఠీపుత్ర శ్రీ శాంతముల (చాంతముల) I తర్వాత రాజైన మాధరి పుత్ర వీర పురుష దత్త ఎన్ని సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు ?

ఎ ) 20 సంవత్సరాలు

13 )మాధరి పుత్ర వీర పురుష దత్త ఎవరిని వివాహం చేసుకున్నాడు ?

ఎ ) ఉజ్జయిని శాక రాజైన రుద్ర సేన కుమార్తె రుద్ర ధర భట్టరిక ను

14) మాధరి పుత్ర వీర పురుష దత్త కూతురు పేరు ఏమిటి ?

ఎ ) కొడబలి సిరి

14) మాధరి పుత్ర వీర పురుష దత్త కూతురు కొడబలి సిరి ని ఎవరికిచ్చి పెండ్లి చేశాడు ?

ఎ ) ఛు టు రాజ కుమారుడికి ఇచ్చి

15) మాధరి పుత్ర వీర పురుష దత్త ఏ మతాన్ని స్వీకరించాడు ?

ఎ) బౌధ్ధ మతాన్ని

16) ఎవరి కాలం లో విజయ పురి ప్రపంచం లోనే అతి పెద్ద బౌధ్ధ క్షేత్రం గా పేరు పొందింది ?

ఎ ) మాధరి పుత్ర వీర పురుష దత్త

17)ఎవరి కాలం లో విజయ పురి కి / ఆయా చుట్టుపక్కల కి వివిధ దేశాల నుండి ఎందరో భిక్కులు , భిక్కినులు సందర్శనానికి వచ్చేవారు ?

ఎ ) మాధరి పుత్ర వీర పురుష దత్త

18) ఎవరి రాజ మహిళలు విజయ పురి లో ఉన్న మహా మఠాలకు దానాలు చేశారు ?

ఎ ) మాధరి పుత్ర వీర పురుష దత్త

19) ఎహువుల ఛాంతముల II పరిపాలనా కాలం ఏది ?

ఎ ) క్రీ.శ . 213 – క్రీ . శ. 237

20 ) ఎహువుల ఛాంతముల II ఏ ధర్మాన్ని పాటించాడు ?

ఎ ) వైదిక ధర్మాన్ని

21 ) ఎహువుల ఛాంతముల II పరిపాలనా కాలం నాటి శాసనాలు ఎక్కడ లభించాయి ?

ఎ ) నాగార్జున కొండ లో

22) ఎహువుల ఛాంతముల II , తన 10 వ పరిపాలనా కాలం లో ఎవరి దండ యాత్ర ను ఎదుర్కొన్నాడు ?

ఎ ) పల్లవ రాజుల

23)బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తూనే ,  శివునికి , పురాణ దేవుళ్ళకి ఎన్నో గుడులు కట్టించిన రాజు ఎవరు ?

ఎ ) ఎహువుల ఛాంతముల II

24) ఎహువుల ఛాంతముల II కాలం లో , ఇక్ష్వాకుల సైన్యాధి పతి ఎవరు ?

ఎ ) ఎలిశ్రీ

25 ) రుద్ర పురుష దత్త పరిపాలన కాలం ఏది ?

ఎ ) క్రీ. శ. 237 – క్రీ. శ. 248

26) రుద్ర పురుష దత్త  , ఎందుకోసం  ఛాయ స్తంభం కట్టించినట్లు  నాగార్జున కొండలో శాసనం లభించింది ?

ఎ ) తల్లి స్మారకార్ధం

27) ఎహువుల క్రీ. శ. 248 లో రాజ్యాధికారం చేపట్టాడు . ఇతని తర్వాత ముగ్గురు ఇక్ష్వాకు రాజులు పాలించారు . వీరి కాలం లో ఎవరు దండయాత్ర చేసి కృష్ణ – గుంటూరు  ప్రాంతాన్ని ఆక్రమించారు ?

ఎ ) పల్లవులు

28) 3వ శతాబ్దం లో అభిర రాజైన వసుసేన , విజయ పురి ని ఆక్రమించాడు . దీనితో తెలంగాణ లో ఎవరి పాలన అంతమైనది ?

ఎ ) ఇక్ష్వాకుల   ( కానీ వీరి కుటుంబం స్థానిక శక్తి గా మిగిలి పోయింది )

29) ఒక శాసనం లో పేర్కొన్నట్లుగా 5వ శతాబ్దం లో , ఇక్ష్వాకులు ఎవరితో  వైవాహిక సంబంధాలు కలుపుకున్నారు ?

ఎ) ఉత్తర మైసూరు ని పాలించిన కెకాయ కుటుంబం తో

 

 

Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)