Model questions on Kalyani Chalukyulu
Model questions on Kalyani Chalukyulu
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I /TSLPRS SUB-INSPECTOR /CONSTABLE
Prepared by :
Praturi Potayya Sarma
కల్యాణి చాళుక్యులు (క్రీ. శ.973 – క్రీ. శ. 1180
)
1)ఎవరు తమని
పశ్చిమ చాళుక్యులమని అని
చెప్పుకున్నారు మరియు బాదామి చాళుక్య వంశస్థుల మని చెప్పుకున్నారు ?
ఎ)కల్యాణి చాళుక్యులు
2)కల్యాణి చాళుక్యులలో ప్రసిద్ధి
పొందిన మొదటి రాజులు ఎవరు ?
ఎ ) తైల I
మరియు విక్రమాదిత్య IV
3) ఎవరు రాష్ట్ర కూటులను పడ దోసి స్వతంత్ర రాజ్యం స్థాపించాడు ?
ఎ ) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997 )
4) తైల II (క్రీ. శ.973 – క్రీ.
శ. 997 ) రాజధాని ఏది ?
ఎ ) మాన్యఖేట
5) ఎవరి కాలం నుండి తెలంగాణ లో
పశ్చిమ చాళుక్యుల ప్రభావం ఉంది ?
ఎ ) తైల II (క్రీ. శ.973 – క్రీ. శ. 997 )
6) “ఇర్వి బెడంగ
సత్యాశ్రయ” అనే మరో పేరు ఎవరికి ఉంది ?
ఎ ) సత్యాశ్రయ (క్రీ. శ.997 –
క్రీ. శ. 1008 )
7) సత్యాశ్రయ (క్రీ. శ.997 –
క్రీ. శ. 1008 ) పట్టపు రాణి ఎవరు ?
ఎ ) దేవ కబ్బె
8)కరీంనగర్
జిల్లాలో గల చొప్ప దండి లో నివసించి దివ కేశ్వరాలయాన్ని నిర్మించిన పట్టపు రాణి ఎవరు ?
ఎ ) దేవ కబ్బె
9) విక్రమాదిత్య ఏ
కాలం లో పరి పాలన చేశాడు ?
ఎ) క్రీ.
శ.1008 – క్రీ. శ. 1015
10 ) ఎవరి కాలం లో తెలంగాణ లో కల్యాణి చాళుక్యుల అనేక శాసనాలు లభ్యమయ్యాయి ?
ఎ )జగదేక మల్ల జయ సింహా II (క్రీ. శ.1015 – క్రీ. శ. 1042 )
11) ఎవరు రాజధానిని మాన్య ఖేట (మాల్కెడ) నుండి కల్యాణి కి మార్చాడు ?
ఎ )త్రైలోక్య మల్ల
సోమేశ్వర (క్రీ. శ.1042 – క్రీ. శ.
1068 )
12) త్రైలోక్య మల్ల
సోమేశ్వర (క్రీ. శ.1042 – క్రీ. శ.
1068 ) కాలం లో వెలుగు లోకి వచ్చింది ఎవరు
?
ఎ ) కాకతీయులు
13) ఎవరు అనుమకొండ విషయ’ ని ప్రోల
రాజు I చేసిన సేవలను గుర్తించి ‘కానుకగా
ఇచ్చాడు ?
ఎ )త్రైలోక్య మల్ల
సోమేశ్వర (క్రీ. శ.1042 – క్రీ. శ.
1068 )
14) ఎవరి కాలం లో పొట్లకేరె (హైదరాబాద్ దగ్గర గల పటాన్
చెరువు ) , కొల్లి పాకె (కుల పాక్ లేదా
కొలను పాక ) లను సైనిక శిబిరాలుగా ఉపయోగించారు ?
ఎ ) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076 – క్రీ. శ.
1126 )
15) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076 – క్రీ. శ.
1126 ) కాలం లో హైదరాబాద్ నుండి శనిగరం వెళ్ళే రహదారి ఎవరికి ప్రధాన మార్గం గా ఉపయోగ పడింది ?
ఎ )సైనిక దళాలకు
16) ఏది
పశ్చిమ చాళుక్య సైన్యానికి సైనిక శిబిరంగా ఉపయోగ పడింది ?
ఎ ) శనిగరం (వరంగల్ జిల్లా లోది గాని / కరీం నగర్ జిల్లా లోది గాని )
17) ఎవరి పాలనా కాలం లోనే కరీం నగర్
జిల్లాలోని పొలాస్ ప్రాంతాన్ని పాలించిన పొలవాస నాయకులు రాజకీయ ప్రాధాన్యం పొందారు
?
ఎ ) విక్రమాదిత్య VI (క్రీ. శ.1076 – క్రీ. శ. 1126 )
18) 60
ఏళ్ళు పాలించిన పొలావాస నాయకుల వంశానికి చెందిన నాలుగు ముఖ్య రాజులు ఎవరు ?
ఎ )మేడ రాజు I ,
జగ్గదేవుడు I, మేడ
రాజు II , మంత్ర కూట గుండరాజు
19) ఎవరు పొలాస (కరీంనగర్ జిల్లా ) లోని పౌలస్తేశ్వరాలయం
, విక్రమాల జీనాలయం నిర్మించి వాటికి విరాళాలను ఇచ్చారు
?
ఎ ) 60 ఏళ్ళు పాలించిన పొలావాస
నాయకుల వంశానికి చెందిన నాలుగు ముఖ్య
రాజులు మేడ రాజు I ,
జగ్గదేవుడు I, మేడ
రాజు II , మంత్ర కూట గుండరాజు
20) తెలంగాణ లో ఎవరి పాలనా సమయం
లో పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యం అంతరించింది
?
ఎ ) తైలా III , సోమేశ్వర IV
21) తైలా III , సోమేశ్వర IV సమయం లో దక్కను ప్రాంతం లో ఏ మూడు ప్రధాన రాజ్య వంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ?
ఎ )(i)కాకతీయ ( వరంగల్ ), (ii)యాదవులు లేదా సౌనులు (దేవగిరి ) ,
(iii) హొయసాలలు (ద్వార
సముద్రం )
Comments
Post a Comment