Administration after Satavahana rule (3 Century AD to 12th Century AD)

  

STUDY MATERIAL FOR CIVIL SERVICES /

TSPSC GROUP I / GROUP IV  EXAMS.

TSLPRS SUB-INSPECTOR /CONSTABLE EXAMS.

 Prepared by : Praturi Potayya Sarma

 

శాతవాహనుల అనంతర కాలం (క్రీ. శ.3 వ శతాబ్దం – క్రీ. శ. 12 వ శతాబ్దం ) -  పరిపాలన

 

1)శాతవాహనుల అనంతర కాలం   లో అతి పెద్ద విభాగం పరిపాలనా పరం గా రాష్ట్రం ఉండేది. దీనికి ఎవరు ఆధిపత్యం వహించేవారు ?

జవాబు : మహాసేనాధిపతి

2)రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విభజించారు . అవి ఏవి ?

జవాబు : దేశ మరియు విషయ

3)రాజ్యం లో అతి చిన్న పరిపాలనా విభాగం ఏది ?

జవాబు : గ్రామం / పల్లెలు

4)గ్రామ పెద్దను ఏమనేవారు ?

జవాబు : మహా తల్వార

5) న్యాయాధికారిని ఏమనేవారు ?

జవాబు : మహా దండనాయక

6)చాళుక్యుల కాలం నుండి తెలంగాణా ప్రాంతం లో పరిపాలనా పద్ధతులు అన్నీ ఏ వ్యవస్థను పోలి ఉండేవి ?

జవాబు : కన్నడ రాజ్య

7) తెలంగాణా ప్రాంతం 50 – 70 గ్రామా ల సమూహంతో కూడిన రాష్ట్రాలు , వేటిగా విభజించబడ్డాయి ?

జవాబు : విషయలు మరియు భుక్తి లు గా

8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?

ఎ)రాష్ట్రపతి : సైన్యానికి పౌర సంబంధమైన పరిపాలనకు ఆధిపత్యం , కొన్ని సందర్భాలలో సామంత రాజు లాగా భోగాలను అనుభవించేవాడు

బి )విషయపతి ‘: వ్యవహార విషయాలలో    రాష్ట్రపతి కి సరిసమానంగా ఉండేవాడు  

సి) భోగపతి : పన్ను వసూలు , రాబడి మొదలైన విషయాలకు అధిపతిగా ఉంటూ గ్రామాధికారియైన నల్గా వుండా / గవుండా ల సహకారంతో పరిపాలన సాగించేవాడు

డి ) పైవన్ని

జవాబు : డి

9)శాసనాల ద్వారా ఎవరెవరున్నారని తెలుస్తోంది ?

ఎ )పెర్ గడ్డె

బి )సేన బోవ /గ్రామ గణకుడు (Village Accountant)

సి ) సేనాధిపతి (Commander of Army); ఎక్కటే (Warrior Class) లేదా సైనిక కుటుంబం

డి ) పైవన్ని

జవాబు : డి

 

10)ఇక్ష్వాకుల రాజధాని ఏది ?

జవాబు : విజయపురి

11) ఇక్ష్వాకుల తర్వాత , నాటి వర్తక వ్యాపారాలలో పేరు పొందిన దానాలు చేసిన వారు ఎవరు / కట్టడాలు కట్టిన వారు ఎవరు ?

జవాబు : నిగమ ; శ్రేణి ; వనిజ ; లేదా శెట్టి

12)ఇక్ష్వాకుల కాలం నాటి నాణాలు ఎలాంటివి ?

జవాబు : చిన్నవి                          

13) విష్ణుకుండినులు ఎలాంటి నాణాలు ఇచ్చేవారు ?

జవాబు : రాగి పూత పూసిన ఇనుప నాణాలను

14) మరట్లు , మత్తర్ , నివర్తన , ఖండుగ, రాజమాన ‘, రాచమాన అనే పదాలు దేనికి సంబంధించినవి ?

జవాబు : భూముల  చిన్న కొలత ప్రమాణాలు

15) శాసనాలలో తెలిపిన  వివిధ రకాల నేలల గురించి   తెలుపండి ?

 ఎ )నీరు నేల / పానీయ క్షేత్రం

బి )పన్నస / చిత్తడినేల

సి ) రాజ్య భూమి ;   మరియు పూదొంట/పూవిన తొంట

జవాబు : పైవన్నీ

16)కృత్రిమ మైన జలాశయాలను  ఏమని పిలిచేవారు ?

జవాబు : కేరె , సముద్రం , కుంటలు , తటకాలు అని పిలిచేవారు

17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (కృత్రిమ జలాశయం : ఉన్న ప్రాంతం )

ఎ ) మది వోజన కెరె  : మెదక్

బి ) భీమ సముద్రము : మహబూబ్ నగర్

సి ) బృహత్ తటాక : నల్గొండ

డి ) పైవన్నీ

జవాబు : డి

18) అచ్చెబ్బె సముద్ర ఎక్కడుంది ?

జవాబు : చొప్పదండి

19) డ్రమ్మాలు , అరువణాలు ఏవి ?

జవాబు : నాణాలు

20) అయ్యవోళి 500 , ఉభయ నానాదేశి , నకరము ఏమిటి ?

జవాబు : వ్యాపార సంస్థలు

21)మహామండేలేశ్వర , మహా సామంతాధిపతి, మహాజన , గవుండ , పెర్ గడె నల్ గవుండ , సేన బోవ , ఎక్క టె  ఏమిటి ?

జవాబు : పరిపాలన సంఘాలు

22) ఇక్ష్వాకు వంశం లో ఎవరి వల్ల బౌధ్ధ మతం మిక్కిలి పోషించ బడింది ?

జవాబు : రాణులు

23) నాగార్జున కొండ, నేల కొండపల్లి , అనుపు , నంది కొండ (నల్గొండ ) లలో బౌధ్ధ మతం లో గల ఏ శాఖలకు ముఖ్యప్రాంతాలు అయ్యాయి ?

జవాబు : తెరవాద మరియు మహాయాన   

24) వేములవాడ చాళుక్య రాజు  , అరికేసరి II కాలం లో ఏది నిర్మించ బడింది ?

జవాబు : త్రిభువన తిలక బా(వా )సడి  అనే జైన ఆలయం

25) శుభ దమ్మ జినాలయం ఎవరు నిర్మించారు ? (దీనిలో జైన కవి సోమదేవుడు ప్రధాన గురువుగా నియమించబడ్డాడు )

జవాబు : బద్దెగ

26)పటాన్ చెరువు , బోధన్ , ఉజ్జిలి , కొలను పాక , పెద కొడుమూరు , తొగర కుంట  దేనికి సాక్షి గా నిలిచాయి ?

జవాబు : ప్రముఖ జైన ప్రాంతాలు గా  

27) విజయ పురి లో ఏవి నిర్మించ బడ్డాయి ?

జవాబు : యాగ శాల , పుష్ప భద్ర (శివ ) , మహా సేన , అష్ట భుజ (విష్ణు ) , హారతి ( శక్తి )

28) విజయ పురి దగ్గర లో గల మంచికల్లు ప్రాంతం లో ఏవి నిర్మించబడ్డాయి ?

జవాబు : నాగేశ్వర స్వామి , హాలమ్ ప్రస్వామి , జీవ శివ స్వామి  వార్ల  దేవాలయాలు

29) శ్రీశైల క్షేత్ర మతానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఏవి ?

జవాబు : త్రిపురాంతకం (తూర్పు ) , సిధ్ధవటము (దక్షిణ ) , ఉమామహేశ్వరం (ఉత్తర ) , అలంపూర్(పడమర )

30)ప్రముఖ వైష్ణవ మాట ప్రాంతాలు ఏవి ?

జవాబు : బూరుగు గడ్డ , మక్తల , లింగగిరి

31) ఇక్ష్వాకుల కాలం లో శ్రీ పర్వతం దేనిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది ?

జవాబు : బౌధ్ధ మత అధ్యయనానికి

32)ఉద్యోతన (8వ శతాబ్దం ) ప్రాకృత భాషలో దేన్ని రచించాడు ?

జవాబు : కువలయమాన (దీనిలో విజయపురి గురించి ఉంది )

33)నాగార్జున కొండలో ఉండి నాగార్జునుడు దేన్ని బోధించాడు ?

జవాబు : మాధ్యమిక తత్వ శాస్త్రాన్ని

34)  విష్ణు కుండినుల కాలం లో వైదిక మత వ్యాప్తి వల్ల వేటి నిర్మాణం జరిగింది ?

జవాబు: ఘటికలు

35) ఏ శతాబ్ది చివరి భాగం లో తెలుగు భాష నెమ్మదిగా ప్రాచుర్యం లోకి వచ్చినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది ?

జవాబు : 9వ శతాబ్దపు చివరి భాగం లో

36 ) ఇక్ష్వాకులు నిర్మించిన స్థూపాలు , విహారాలు , చైతన్య నిర్మాణాలలో వేటిని బాగా అనుకరించారు ?

జవాబు : మధుర , అమరావతి , కుషాణుల శిల్ప శైలిని

37) ఎప్పటి నుండి విజయ పురి ప్రాంతాలలో చాలా వైదిక సంప్రదాయ కట్టడాలు నిర్మించబడ్డాయి ?

జవాబు : ఎహువల చాంతమూలు ని పాలన లో 10వ సంవత్సరం నుండి

38) ఏది ఆలయ నిర్మాణాలకు నాంది గా నిలిచింది ?

జవాబు : పుష్ప భద్రాలయం

39 ) 7వ శతాబ్దం నుండి బాదామి చాళుక్యులు ఆలయ నిర్మాణం లో నూతన శైలిని ప్రవేశ పెట్టారు . దాని పేరు ఏమి ?

జవాబు : వేసర

40) వేసర దేని సమ్మిళితం ?

జవాబు : ఉత్తర భారతం లో గల నగర , దక్షిణ భారతం లో గల ద్రవిడ శైలి ల సమ్మిళితం

41) వేముల వాడ చాళుక్యులు దేన్ని విరివిగా ఉపయోగించారు ?

జవాబు : వేసర

42) ఎక్కడి శివాలయాలలో వేసర శైలిని చూడగలము ?

జవాబు : అలంపూర్‌ (గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది )

43) ఏ జైన దేవాలయాలలో వేసర శైలిని చూడగలము ?

జవాబు : వేములవాడ , శనిగరం , కోరుట్ల , కొలనుపాక 

 


Comments

Popular posts from this blog

TSPSC Group – I Mains,2024 Paper : 1 General Essay Model Question Paper 1

Questions ( for Paper 3 ) (ECONOMY: NATIONAL INCOME, ECONOMY AND DEVELOPMENT) STUDY MATERIAL FOR TGPSC GROUP II Examinations : December, 2024

NIZAM- UL- MULK (1724-1748 AD)