Administration after Satavahana rule (3 Century AD to 12th Century AD)
STUDY MATERIAL FOR CIVIL SERVICES /
TSPSC GROUP I / GROUP IV EXAMS.
TSLPRS SUB-INSPECTOR /CONSTABLE EXAMS.
Prepared by :
Praturi Potayya Sarma
శాతవాహనుల అనంతర కాలం (క్రీ. శ.3 వ శతాబ్దం – క్రీ. శ. 12 వ శతాబ్దం ) - పరిపాలన
1)శాతవాహనుల అనంతర కాలం లో అతి పెద్ద విభాగం పరిపాలనా పరం గా ‘రాష్ట్రం ‘ ఉండేది. దీనికి ఎవరు
ఆధిపత్యం వహించేవారు ?
జవాబు : మహాసేనాధిపతి
2)రాష్ట్రాన్ని రెండు భాగాలుగా
విభజించారు . అవి ఏవి ?
జవాబు : ‘దేశ’ మరియు ‘విషయ’
3)రాజ్యం లో అతి చిన్న పరిపాలనా విభాగం
ఏది ?
జవాబు : గ్రామం / పల్లెలు
4)గ్రామ పెద్దను ఏమనేవారు ?
జవాబు : మహా తల్వార
5) న్యాయాధికారిని ఏమనేవారు ?
జవాబు : మహా దండనాయక
6)చాళుక్యుల కాలం నుండి తెలంగాణా ప్రాంతం
లో పరిపాలనా పద్ధతులు అన్నీ ఏ వ్యవస్థను పోలి ఉండేవి ?
జవాబు : కన్నడ రాజ్య
7) తెలంగాణా ప్రాంతం 50 – 70 గ్రామా ల
సమూహంతో కూడిన ‘రాష్ట్రాలు ‘ , వేటిగా విభజించబడ్డాయి ?
జవాబు : ‘విషయలు’ మరియు ‘భుక్తి ‘ లు గా
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ)’రాష్ట్రపతి ‘ : సైన్యానికి పౌర సంబంధమైన పరిపాలనకు ఆధిపత్యం ,
కొన్ని సందర్భాలలో ‘సామంత రాజు ‘ లాగా
భోగాలను అనుభవించేవాడు
బి )’విషయపతి
‘: వ్యవహార విషయాలలో
రాష్ట్రపతి కి సరిసమానంగా ఉండేవాడు
సి) ‘భోగపతి
‘ : పన్ను వసూలు , రాబడి మొదలైన
విషయాలకు అధిపతిగా ఉంటూ గ్రామాధికారియైన ‘నల్గా వుండా /
గవుండా ‘ ల సహకారంతో పరిపాలన సాగించేవాడు
డి ) పైవన్ని
జవాబు : డి
9)శాసనాల ద్వారా ఎవరెవరున్నారని
తెలుస్తోంది ?
ఎ )’పెర్
గడ్డె’
బి )సేన బోవ /గ్రామ గణకుడు (Village Accountant)
సి ) సేనాధిపతి (Commander of Army); ‘ఎక్కటే ‘ (Warrior Class) లేదా సైనిక కుటుంబం
డి ) పైవన్ని
జవాబు : డి
10)ఇక్ష్వాకుల రాజధాని ఏది ?
జవాబు : విజయపురి
11) ఇక్ష్వాకుల తర్వాత , నాటి వర్తక వ్యాపారాలలో పేరు పొందిన దానాలు చేసిన
వారు ఎవరు / కట్టడాలు కట్టిన వారు ఎవరు ?
జవాబు : ‘నిగమ’ ; ‘శ్రేణి ‘ ; ‘వనిజ ‘ ; లేదా ‘శెట్టి ‘
12)ఇక్ష్వాకుల కాలం నాటి నాణాలు ఎలాంటివి
?
జవాబు : చిన్నవి
13) విష్ణుకుండినులు ఎలాంటి నాణాలు
ఇచ్చేవారు ?
జవాబు : రాగి పూత పూసిన ఇనుప నాణాలను
14) ‘మరట్లు
‘ , ‘మత్తర్’ , ‘నివర్తన ‘ , ఖండుగ, ‘రాజమాన ‘, ‘రాచమాన’ అనే పదాలు దేనికి సంబంధించినవి ?
జవాబు : భూముల చిన్న కొలత ప్రమాణాలు
15) శాసనాలలో తెలిపిన వివిధ రకాల నేలల గురించి తెలుపండి ?
ఎ
)నీరు నేల / పానీయ క్షేత్రం
బి )పన్నస / చిత్తడినేల
సి ) రాజ్య భూమి ; మరియు ‘పూదొంట/పూవిన తొంట
జవాబు : పైవన్నీ
16)కృత్రిమ మైన జలాశయాలను ఏమని పిలిచేవారు ?
జవాబు : ‘కేరె
‘ , ‘సముద్రం ‘ , ‘కుంటలు’ , ‘తటకాలు’ అని పిలిచేవారు
17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? (కృత్రిమ జలాశయం : ఉన్న ప్రాంతం )
ఎ ) మది వోజన కెరె : మెదక్
బి ) భీమ సముద్రము : మహబూబ్ నగర్
సి ) బృహత్ తటాక : నల్గొండ
డి ) పైవన్నీ
జవాబు : డి
18) ‘అచ్చెబ్బె
సముద్ర ‘ ఎక్కడుంది ?
జవాబు : చొప్పదండి
19) ‘డ్రమ్మాలు’ , ‘అరువణాలు’ ఏవి ?
జవాబు : నాణాలు
20) ‘అయ్యవోళి
500 ‘ , ‘ఉభయ
నానాదేశి’ , ‘నకరము
‘ ఏమిటి ?
జవాబు : వ్యాపార సంస్థలు
21)మహామండేలేశ్వర , మహా సామంతాధిపతి, మహాజన , గవుండ , పెర్ గడె ‘ నల్ గవుండ
, సేన బోవ , ఎక్క టె ఏమిటి ?
జవాబు : పరిపాలన సంఘాలు
22) ఇక్ష్వాకు వంశం లో ఎవరి వల్ల బౌధ్ధ
మతం మిక్కిలి పోషించ బడింది ?
జవాబు : రాణులు
23) నాగార్జున కొండ, నేల కొండపల్లి , అనుపు , నంది కొండ (నల్గొండ ) లలో బౌధ్ధ మతం లో గల ఏ శాఖలకు ముఖ్యప్రాంతాలు
అయ్యాయి ?
జవాబు : ‘తెరవాద’ మరియు ‘మహాయాన ‘
24) వేములవాడ చాళుక్య రాజు , అరికేసరి II కాలం లో ఏది నిర్మించ బడింది ?
జవాబు : ‘త్రిభువన
తిలక బా(వా )సడి అనే జైన ఆలయం
25) శుభ దమ్మ జినాలయం ఎవరు నిర్మించారు ? (దీనిలో జైన కవి సోమదేవుడు ప్రధాన గురువుగా
నియమించబడ్డాడు )
జవాబు : బద్దెగ
26)పటాన్ చెరువు , బోధన్ , ఉజ్జిలి , కొలను పాక , పెద కొడుమూరు ,
తొగర కుంట దేనికి సాక్షి గా నిలిచాయి ?
జవాబు : ప్రముఖ జైన ప్రాంతాలు గా
27) విజయ పురి లో ఏవి నిర్మించ బడ్డాయి ?
జవాబు : యాగ శాల , పుష్ప భద్ర (శివ ) , మహా సేన , అష్ట భుజ (విష్ణు ) , హారతి ( శక్తి )
28) విజయ పురి దగ్గర లో గల మంచికల్లు
ప్రాంతం లో ఏవి నిర్మించబడ్డాయి ?
జవాబు : నాగేశ్వర స్వామి , హాలమ్ ప్రస్వామి , జీవ శివ
స్వామి వార్ల దేవాలయాలు
29) శ్రీశైల క్షేత్ర మతానికి నాలుగు
ప్రధాన ద్వారాలు ఏవి ?
జవాబు : త్రిపురాంతకం (తూర్పు ) , సిధ్ధవటము (దక్షిణ ) ,
ఉమామహేశ్వరం (ఉత్తర ) , అలంపూర్(పడమర )
30)ప్రముఖ వైష్ణవ మాట ప్రాంతాలు ఏవి ?
జవాబు : బూరుగు గడ్డ , మక్తల , లింగగిరి
31) ఇక్ష్వాకుల కాలం లో శ్రీ పర్వతం
దేనిలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది ?
జవాబు : బౌధ్ధ మత అధ్యయనానికి
32)ఉద్యోతన (8వ శతాబ్దం ) ప్రాకృత భాషలో దేన్ని రచించాడు ?
జవాబు : ‘కువలయమాన
‘ (దీనిలో విజయపురి గురించి ఉంది )
33)నాగార్జున కొండలో ఉండి నాగార్జునుడు
దేన్ని బోధించాడు ?
జవాబు : మాధ్యమిక తత్వ శాస్త్రాన్ని
34) విష్ణు కుండినుల కాలం లో వైదిక మత వ్యాప్తి వల్ల
వేటి నిర్మాణం జరిగింది ?
జవాబు: ఘటికలు
35) ఏ శతాబ్ది చివరి భాగం లో తెలుగు భాష
నెమ్మదిగా ప్రాచుర్యం లోకి వచ్చినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తోంది ?
జవాబు : 9వ శతాబ్దపు చివరి భాగం లో
36 ) ఇక్ష్వాకులు నిర్మించిన స్థూపాలు , విహారాలు , చైతన్య నిర్మాణాలలో
వేటిని బాగా అనుకరించారు ?
జవాబు : మధుర , అమరావతి , కుషాణుల శిల్ప శైలిని
37) ఎప్పటి నుండి విజయ పురి ప్రాంతాలలో
చాలా వైదిక సంప్రదాయ కట్టడాలు నిర్మించబడ్డాయి ?
జవాబు : ఎహువల చాంతమూలు ని పాలన లో 10వ
సంవత్సరం నుండి
38) ఏది ఆలయ నిర్మాణాలకు నాంది గా
నిలిచింది ?
జవాబు : పుష్ప భద్రాలయం
39 ) 7వ శతాబ్దం నుండి బాదామి చాళుక్యులు
ఆలయ నిర్మాణం లో నూతన శైలిని ప్రవేశ పెట్టారు . దాని పేరు ఏమి ?
జవాబు : ‘వేసర
‘
40) ‘వేసర
‘ దేని సమ్మిళితం ?
జవాబు : ఉత్తర భారతం లో గల ‘నగర ‘ ,
దక్షిణ భారతం లో గల ‘ద్రవిడ’ శైలి ల
సమ్మిళితం
41) వేముల వాడ చాళుక్యులు దేన్ని
విరివిగా ఉపయోగించారు ?
జవాబు : ‘వేసర
‘
42) ఎక్కడి శివాలయాలలో ‘వేసర ‘ శైలిని చూడగలము ?
జవాబు : అలంపూర్ (గతంలో మహబూబ్ నగర్
జిల్లాలో ఉండేది )
43) ఏ జైన దేవాలయాలలో ‘వేసర ‘ శైలిని చూడగలము ?
జవాబు : వేములవాడ , శనిగరం , కోరుట్ల , కొలనుపాక
Comments
Post a Comment